చమురు ధరలు పెరగడంతో ఆకాసా ఎయిర్ మార్చి 15 నుంచి దేశీయ-అంతర్జాతీయ విమాన టికెట్లపై ₹199–₹1,300 వరకు ఫ్యూయల్ సర్చార్జ్ విధించనున్నట్లు తెలిపింది. ప్రయాణ దూరాన్ని బట్టి ఈ ఛార్జ్ మారుతుంది. ఇదే విధంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో కూడా సర్చార్జ్ వసూలు చేస్తున్నాయి.
అదే సమయంలో ఆకాసా ఎయిర్ ఉత్తరప్రదేశ్లోని జేవార్లో నిర్మాణంలో ఉన్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (MRO) సెంటర్ ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం ప్రకటించింది. ఇది భారత్లో విమాన సంరక్షణ సామర్థ్యాన్ని పెంచి ఉద్యోగాలు, నైపుణ్య అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపింది.
ఆకాసా ఎయిర్కు ఇది తొలి MRO సౌకర్యం కాగా, నోయిడా విమానాశ్రయానికి మార్చి 6న DGCA ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరు చేసింది.